100 రోజుల READ క్యాంపెయిన్ పై సూచనలు:
సమస్త మండల విద్యాధికారులకు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,URS/KGBV ప్రత్యేక అధికారులకు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు తెలియజేయునది ఏమనగా,
🔹సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ గారు
▪️పాఠశాలలోని పూర్వ ప్రాథమిక తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు
▪️తేదీ 05.02. 2022 నుండి 100 రోజుల పాటు పఠన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు.
▪️విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి పఠనం ద్వారా భాషా మరియు నైపుణ్యం పెరగడానికి కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలి.
👉ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి. విద్యార్థులకు చదవడం ఒక అలవాటుగా మారాలి మరియు విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి.
▪️అందువలన ఈ కార్యక్రమమును క్రింది సూచనలతో ఖచ్చితంగా అన్ని పాఠశాలలలో నిర్వహించాలి.
👉విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ఒక పీరియడు కేటాయించాలి.
👉పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీ గాని పెయింటింగ్ గాని చార్ట్ పై గాని READ PROGRAMME గురించి ప్రదర్శించాలి.
👉 చదువు- ఆనందించు-అభివృద్ధి చెందు అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
👉 పాఠశాలలోని పుస్తకములను వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శింప చేయాలి.
👉 తరగతి వారీగా విద్యార్థులచే గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయాలి. (ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతుల నుంచి ఐదుగురు విద్యార్థులతో గ్రంథాల కమిటీ ఏర్పాటు చేయాలి)
👉పాఠశాలలో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.
👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.
👉 ఈ కార్యక్రమ నిర్వహణకు ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఎన్జీవోలను, సమాజ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి.
👉 ఇంటివద్ద చదవటానికి ప్రోత్సహించాలి.
👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలి.
👉ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.
👉నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
👉ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి వారిగా వారి ప్రగతిని రికార్డు చేస్తూ మరియు సమీక్షిస్తూ పనితీరు మెరుగుదలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సూచనలు చేయవలెను .
👉ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించ వలెను.
👉మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ తమ మండలంలో,స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో క్రమం తప్పక మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడం అయినది.
పఠనానికి మార్గదర్శకాలివే…
@ గ్రంథాలయ పుస్తకాలు చదివేందుకు ప్రతిరోజూ ఒక పీరియడ్ కేటాయించాలి. మూడురోజులు మాతృభాషలో, రెండురోజులు ఆంగ్లభాషలో, ఒకరోజు ద్వితీయభాషలోని కథల పుస్తకాలను చదివించాలి.
@ ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులతో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి తొమ్మితో తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాలి.
@ వారికి ఆసక్తి కలిగిన పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇంటి దగ్గర సైతం ఆ పుస్తకాలు చదివించేలా కృషి చేయాలి.
@ ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి. కథలు చెప్పించడం, చదివిన దాని గురించి మాట్లాడించడం వంటి పోటీలతో విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంచాలి.
@ నెలకు ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులను పాఠశాలలకు ఆహ్వానించాలి. వారి నేతృత్వంలో విజేతలకు బహుమతులు అందజేయాలి.
@ రూమ్ టు రీడ్, సేవ్ ద చిల్డ్రన్, యూనిసెఫ్, బ్రెడ్ వంటి స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
@ అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి. 21న అన్ని పాఠశాలల్లో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలి.
@ మండలస్థాయిలో ఎంఈవో ఐదుగురు విషయ నిపుణులతో కోర్ టీంను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ వారానికి ఒక సారి పఠనాభివృద్ధి నివేదికను డీఈవోకు సమర్పించాలి.
@ జిల్లాలోని సెక్టోరల్ ఆఫీసర్లకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించాలి. జిల్లాస్థాయిలో DEO ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, సూచనలు, సలహాలు ఇవ్వాలి.
@ ఆయా గ్రామాల్లో విరాళాలు ఇచ్చేవారిని ప్రోత్సహించాలి. ఆ నిధులతో పఠనాభివృద్ధి కార్యక్రమాన్ని పటిష్ఠం చేయాలి.